హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా తొలి సిరీస్ విజయంతో ఎంజాయ్ చేస్తుంది. గురువారం జరగనున్న వన్డేకు ముందు జట్టు సభ్యులు కాస్త జాలీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ భార్యలు సాక్షి, అనుష్క శర్మలు ఇంగ్లాండ్లో చేరుకొన్నారు. బ్రిస్టల్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టీ20ల్లో సాక్షి, అనుష్క సందడి చేసిన సంగతి తెలిసిందే.
నిర్ణయాత్మక మ్యాచ్లో విజయం అనంతరం కోహ్లీ.. స్టేడియం నుంచే అనుష్కకు ముద్దు విసురుతూ కనిపించాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన అనుష్క కోహ్లీని కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గాను మారాయి. దీంతో పాటుగా ఇంకో ఫొటోను కోహ్లీనే స్వయంగా పంచుకున్నాడు.
ప్రస్తుతం కోహ్లీ సేన ఆతిథ్య ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు సిద్ధమౌతోంది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. మ్యాచ్ల మధ్య విరామం రావడంతో ఆటగాళ్లు స్థానిక ప్రదేశాలలో తిరుగుతూ జాలీగా గడిపేస్తున్నారు. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ కలిసి చక్కర్లు కొడుతున్నారు.
తాజాగా కోహ్లీ.. అనుష్కతో కలిసి దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. 'నా బ్యూటీ అనుష్క శర్మతో డే ఔట్' అని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీని అనుష్క ముద్దుపెట్టుకుంటున్న ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోకి అభిమానులు తెగ లైక్లు, కామెంట్లు పెడుతున్నారు. 'అందమైన జంట, చూడముచ్చటైన ప్రేమ జంట' అంటూ ఇష్టమొచ్చినట్లుగా ట్వీట్లతో మెచ్చేసుకుంటున్నారు.