ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం (మార్చి 2) టీమిండియా - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్ పై శతకం బాది ఫామ్ లో వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడికి కివీస్ తో జరిగే మ్యాచ్ లో.. ఏకంగా 6 రికార్డులను బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. అందులో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, శిఖర్ ధావన్ రికార్డులు కూడా ఉన్నాయి. అవేంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసింది వీరే :
కోహ్లీ మరో 52 పరుగులు చేస్తే శిఖర్ ధావన్ ఛాంపియన్స్ ట్రోఫీ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో తరఫున అత్యధిక పరుగుల వీరులు వీరే :
ఓవరాల్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 7వ స్థానంలో నిలిచాడు. విరాట్ మరో 142 పరుగులు చేస్తే గేల్ ను అధిగమిస్తాడు.
వన్డేల్లో న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు చేసింది వీరే :
న్యూజిలాండ్ పై భారత్ తరఫున సచిన్ తెందుల్కర్(42 వన్డేలు, 1750 పరుగులు) అత్యధిక పరుగులు చేశాడు. కోహ్లీ మరో 106 పరుగులు చేస్తే ఈ రికార్డును అధిగమిస్తాడు.
వన్డేల్లో న్యూజిలండ్ పై ఎక్కువ సెంచరీలు బాదిన ప్లేయర్స్ :
విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్.. న్యూజిలాండ్ పై సమానంగా 6 సెంచరీలతో ఉన్నారు. ఇప్పుడు విరాట్ మరో శతకం బాదిన వాళ్లని అధిగమిస్తాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్స్ :
విరాట్ కోహ్లీ ఆరు సార్లు ఫిఫ్టీ స్కోర్స్ చేశాడు. ఈ సారి కూడా అతడు చేస్తే.. శిఖర్ ధావన్,గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ను దాటి అగ్రస్థానానికి చేరుకుంటాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసింది వీరే :
వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో అతడు మరో 150 పరుగులు చేస్తే కుమార సంగక్కర ను దాటి రెండో స్థానంలో నిలుస్తాడు. సచిన్ 18,426తో టాప్ లో ఉండగా.. కుమార సంగక్కర 14,234 పరుగులతో ఉన్నాడు. కోహ్లీ 14,085 రన్స్ తో కొనసాగుతున్నాడు.