
ఆ రెండు సిక్సర్లు..
పాకిస్తాన్పై భారత్ గెలవాలంటే చివరి 12 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన దశ అది. విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా క్రీజ్లో ఉండటం వల్ల విజయం భారత్నే వరిస్తుందనే ఆశ అభిమానుల్లో నెలకొంది. 19వ ఓవర్లో గేర్ మారిస్తే గానీ విజయం దక్కదనే విషయం వారిద్దరికీ తెలుసు. స్టార్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సంధించిన ఓవర్ అది. పైగా ఆ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో వచ్చింది మూడు పరుగులే. ఆ తరువాత కోహ్లీ విజృంభించాడు.

మారిన సమీకరణాలు..
ఆ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మెరుపువేగంతో ఆ రెండు బంతులను ఫెన్సింగ్ దాటించాడు. 19వ ఓవర్లో 17 పరుగులు రావడంతో ఈక్వేషన్లు మారిపోయాయి. చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు అవసరం అయ్యాయి టీమిండియాకు. దాన్ని లాంఛనంగా ముగించాడు కోహ్లీ.

ఆ రెండు సిక్సర్లపై..
హ్యారిస్ రవూఫ్ వేసిన 19వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలచడం పట్ల విరాట్ కోహ్లీ స్పందించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వాటి గురించి ఎలా స్పందించాలో తనకు తెలియట్లేదని చెప్పాడు. 19వ ఓవర్లో ఖచ్చితంగా రెండు సిక్సర్లు కొడితే గానీ చివరి ఓవర్లో తమపై పడే భారాన్ని, ఒత్తిడిని అధిగమించలేమని భావించానని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

బంతిపైనే ఫోకస్..
తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులే రావడం తనను కొంత ఆందోళనకు గురి చేసిందని కోహ్లీ చెప్పాడు. చివరి రెండు బంతులను సిక్సర్లుగా కొట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు. అయిదో బంతిని స్టింటెడ్ షాట్గా మలిచానని చెప్పాడు. బంతిపైనే ఫోకస్ పెట్టాలని, అది ఎలా వచ్చినా గానీ.. కదలకుండా షాట్ ఆడాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు. బంతిని కనెక్ట్ కావడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చానని అన్నాడు.

కేరీర్ మొత్తంపై
అలాంటి రీస్కీ షాట్లను ఆడాల్సిన అవసరం కూడా ఉందని తనకు అనిపించిందని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. బెయిల్స్ ఎత్తులో వచ్చిన బంతిని స్ట్రెయిట్ షాట్ ఆడానని గుర్తు చేశాడు. బౌలర్ తల మీదుగా టెక్నిక్కు పవర్ను జోడించి ఆ షాట్ ఆడానని పేర్కొన్నాడు. చివరి బంతిని హ్యారిస్ రవూఫ్ ఎలా వేస్తాడనే విషయం మీద అప్పుడే తనకు ఓ స్పష్టత ఏర్పడిందని, దాన్ని కూడా షాట్ ఆడాలని అనుకున్నట్లు వివరించాడు. లెగ్ స్టంప్పైకి వేసిన బంతిని సింపుల్గా ఫ్లిక్ చేశానని అన్నాడు.


Click it and Unblock the Notifications
