మాంచెస్టర్: మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్లో కేప్టెన్ విరాట్ కోహ్లీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడట. ఈ నిర్ణయాన్ని అమలు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం ఎలా వేరేలా ఉండేదేమో!. ఆలోచన చేశారు గానీ, దాన్ని సకాలంలో అమలు చేయలేకపోయారు. ఫలితం- మనకు తెలిసిందే. న్యూజిలాండ్తో జరిగిన ఆ సెమీఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రావాలని నిర్ణయించుకున్నాడట.
ఇదే విషయాన్ని సీనియర్ బ్యాట్స్మెన్ మహేంద్రసింగ్ ధోనీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సహాయక కోచ్ సంజయ్ బంగర్లతో పంచుకున్నాడట. దీనిపై అప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేకపోయారని, దీనితో యథాతథంగా కోహ్లీ వన్డౌన్గా క్రీజులో దిగాడని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ కథనాన్ని ఓ ఆంగ్ల జాతీయ దినపత్రిక ప్రచురించింది.
ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఆరంభ ఓవర్లలో కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ చెలరేగిపోయాడు. వరుసగా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను పెవిలియన్ దారి పట్టించాడు. ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూస్తూ గడిపిన విరాట్ కోహ్లీ.. తాను బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి వెళ్తానని, నాలుగో స్థానంలో ఆడతానని రవిశాస్త్రికి, ధోనీలకు చెప్పగా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఈ కథనంలో పేర్కొన్నారు.
వీడియో: సెమీస్లో టీమిండియా ఓడిపోతుందని ఏడునెలల కిందటే జోస్యం
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తలా ఓ పరుగు చేసి అవుట్ అయ్యారు. వన్డౌన్గా వచ్చిన విరాట్ కోహ్లీ సైతం ఒక పరుగే చేసి పెవిలియన్ దారి పట్టాడు. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ లైనప్లో నాలుగో స్థానం బలహీనంగా ఉందని, తాను ఆ స్థానంలో బ్యాటింగ్ చేస్తానని కోహ్లీ భావించాడు. వన్డౌన్గా రిషబ్ పంత్ లేదా హార్దిక్ పాండ్యాలను పంపాలనిర్ణయించుకున్నాడు. దీనికి కోచ్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని ఆ కథనంలో పేర్కొన్నారు.