కోహ్లీని ఓ ప్రత్యేకమైన ఆటగాడిగా
"ఈ గణాంకాలే కోహ్లీని ఓ ప్రత్యేకమైన ఆటగాడిగా మిగిల్చాయి. మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో కనీసం 50 సగటున ఉన్న ఏకైక బ్యాట్స్మన్. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత ధోని ప్రభ క్రమంగా క్షీణించినప్పటి నుంచి ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా కోహ్లీ లాగా ఒత్తిడిలో పనిచేయలేదు" అని విజ్డన్ పేర్కొంది.
27 సెంచరీలతో సహా
గత దశాబ్దంలో విరాట్ కోహ్లీ 27 సెంచరీలతో సహా టెస్టుల్లో 7,202 పరుగులు చేశాడు. ఇక, వన్డేల్లో 11,125 పరుగులు, టీ20ల్లో 2,633 పరుగులు చేశాడు. విజ్డన్ ప్రకటించిన జట్టులో టీమిండియా నుంచి కోహ్లీతో పాటు రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కింది.
విజ్డన్ ప్రకటించిన టెస్టు జట్టు
అలెస్టర్ కుక్ (ఇంగ్లాండ్) డేవిడ్ వార్నర్( ఆస్ట్రేలియా), కుమార సంగక్కర్ల( శ్రీలంక), స్టీవ్ స్మిత్ ( ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ( భారత్), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), ఏబీ డెవిలియర్స్( దక్షిణాఫ్రికా), రవిచంద్రన్ అశ్విన్( భారత్), డేల్ స్టెయిన్( దక్షిణాఫ్రికా), కగిసో రబాడ( దక్షిణాఫ్రికా), జేమ్స్ ఆండర్సన్( ఇంగ్లాండ్)