న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ర్యాంకులు: కోహ్లీ నెంబర్ వన్ ర్యాంకు పదిలం

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో కోహ్లీ చేసిన 104 పరుగులు అతడిని అగ్రస్ధానంలో కొనసాగేలా చేశాయి.

న్యూజిలాండ్‌ సిరీస్‌లో మొత్తం 104 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 13 రేటింగ్‌ పాయింట్లు సంపాదించాడు. రెండో స్థానంలో కొనసాగుతున్న ఆరోన్‌ ఫించ్‌ (ఆస్ట్రేలియా)తో తన పాయింట్ల అంతరాన్ని 40కు పెంచుకున్నాడు.

Virat Kohli consolidates position at the top of ICC T20I rankings

ఇక, ఈ సిరిస్‌లో 93 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ మూడు స్థానాలు ఎగబాకి 21 స్ధానంలో నిలవగా, 87 పరుగులు చేసిన శిఖర్ ధావన్‌ 20 స్థానాలు మెరుగుపరచుకుని 45వ స్ధానంలో కొనసాగుతున్నాడు.

భారత బౌలర్ల విషయానికి వస్తే భువనేశ్వర్‌ కుమార్‌ 26, లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ 30, అక్షర్‌ పటేల్‌ 62 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన జస్ప్రీత్‌ బుమ్రా 724 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

జట్టు ర్యాంకుల్లో టీమిండియా 119 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతుండగా... పాకిస్థాన్‌ 124 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడు టీ20ల సిరిస్‌లో 2-1తో ఓటమి పాలైన న్యూజిలాండ్‌ 125 పాయింట్ల నుంచి 120 పాయింట్లకు పడిపోయింది. దీంతో రెండో స్థానంలో ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X