హైదరాబాద్: తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కోహ్లీ ఏం విషయం పంచుకున్నా అది అభిమానులకు పండగే. అతని లైఫ్ స్టైల్, వైవాహిక జీవితం ఏ విషయమైనా వైరల్గా మారాల్సిందే. రెండు రోజుల క్రితం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. విరామ సమయంలో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూ.. విరామాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ.. ఈ సారి అనుష్కతో కలిసి ఉన్న ఫొటోను ట్యాగ్ చేశాడు.
ఇంతకుముందు పోస్ట్ చేసిన ఫొటోలో అనుష్క కనిపించకపోవడంతో నెటిజన్ల దగ్గర్నుంచి అనుష్క ఏది? ఎక్కడికి వెళ్లింది? అంటూ అభిమానులు ప్రశ్నలు సంధించారు. అయితే వారికి త్వరగానే బదులిచ్చాడు కోహ్లీ. తాజాగా తన ఇన్స్టాగ్రాం ద్వారా అనుష్కతో కలిసి జిమ్లో కలిసి కసరత్తులు చేస్తోన్న వీడియోను పంచుకున్నాడు.
Training together makes it even better! ♥️♥️♥️ @anushkasharma
A post shared by Virat Kohli (@virat.kohli) on
ఫిట్నెస్ కోసం మరో సెషన్లో పాల్గొంటున్నాను. చూడండి నాతో పాటు ఎవరున్నారో.. జిమ్లో మరింత సరదాగా ఉంది. కార్డియో నా కంటే బాగా అనుష్కే చేస్తోంది. అంటూ కోహ్లీ సరదాగా మాట్లాడుతూ.. అనుష్క వైపు కెమెరా చూపించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఫిట్నెస్కే అధిక ప్రాధాన్యతనిచ్చే కోహ్లీ మెడనొప్పితో కౌంటీ క్రికెట్కు దూరం కావడం బాధాకరం.
ఐపీఎల్ ముగిసినప్పటి నుంచి కోహ్లీ మెడ నొప్పి గాయంతో బాధపడుతున్నాడు. బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో కోహ్లీ చికిత్స పొందుతున్నాడు. జూన్ 15న కోహ్లీ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కోనున్నాడు. అఫ్గాన్తో చరిత్రాత్మక టెస్టుకు దూరమైన కోహ్లీ ఐర్లాండ్తో రెండు టీ20 సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.