ముంబై: టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ఇంటివాడయ్యాడు. ఇంటి వాడయ్యాడంటే తన ప్రియురాలు అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడనుకున్నారా? అది కాదు. అతనో ఫ్లాట్ కొనేశాడు.
మహారాష్ట్రలోని ముంబైలోని వర్లీ ప్రాంతంలో రూ. 34 కోట్లతో విలాసవంతమైన అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ను కోహ్లి తాజాగా కొనుగోలు చేశాడు. ఈ ఫ్లాట్35వ అంతస్థులో 7171 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

కాగా, 2014లో ఇదే అపార్ట్మెంట్లోని 29వ అంతస్తును టీమిండియా సహచరుడైన యువరాజ్ సింగ్ కొనుగోలు చేయగా.. ప్రస్తుతం కోహ్లీ సముద్ర వీక్షణకు అనువుగా ఉన్న ఈ 35వ అంతస్తును కొనుగోలు చేశాడు.
గత కొన్ని నెలలుగా ప్రేయసి అనుష్క శర్మతో కలిసి ముంబైలో ఇల్లు వెతికిన కోహ్లీ ఈ మధ్యనే ఈ ఫ్లాట్కు సంబంధించి వ్యవహారాలు చక్కబెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లాట్ని 2018లో కోహ్లీకి అప్పగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఫ్లాట్ సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.