
తక్కువ ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించిన కెప్టెన్గా
అందరికంటే తక్కువ ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించిన కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కెప్టెన్గా 2000 పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీకి 36 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. ఇప్పటి వరకూ ఏబీ డివిలియర్స్ (41 ఇన్నింగ్స్లు) పేరిట ఉన్న 'కెప్టెన్' రికార్డును కోహ్లీ అధిగమించాడు.

రెండు వేల పరుగుల్ని పూర్తి చేయడానికి
వన్డేల్లో కెప్టెన్గా రెండు వేల పరుగుల్ని పూర్తి చేయడానికి ఏబీ డివిలియర్స్కి అవసరమైన ఇన్నింగ్స్లు 41. అయితే కోహ్లీ ఇంకా ఐదు ఇన్నింగ్స్లు ముందుగానే ఆ మైలురాయిని అందుకున్నాడు. బెంగళూరు వన్డేకి ముందు కోహ్లీ ఈ ఘనతను సాధించడానికి 13 పరుగులు అవసరమయ్యాయి.

21 పరుగులు చేసి అవుటైన కోహ్లీ
అయితే గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ 21 పరుగులు చేసి అవుటయ్యాడు. ఐదు వన్డేల సిరిస్ను కోహ్లీసేన ఇప్పటికే సొంతం చేసుకుంది. దీంతో నామమాత్రమైన నాలుగో వన్డేలో కోహ్లీ సేన ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 334 పరుగులు చేసింది.

భారత్పై 21 పరుగుల తేడాతో ఆసీస్ విజయం
335 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. దీంతో భారత్పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్లలో రహానే 53, రోహిత్ శర్మ 65, కోహ్లీ 21, పాండ్యా 41 పరుగులు చేయగా... జాదవ్ 67, పాండే 33, ధోనీ 13, షమీ 6, అక్షర్ పటేల్ 5, ఉమేశ్ యాదవ్ 2 పరుగులు చేశారు.


Click it and Unblock the Notifications











