రూమర్లే అని కొట్టి పడేయడానికి లేదు
ఔను. రూమర్లే అని కొట్టి పడేయడానికి లేదు. ఎందుకంటే విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ సెలవు పెట్టాడు. ఢిల్లీ జట్టుకి ప్రస్తుతం రాజ్కుమార్ శర్మ కోచ్గా వ్యవహరిస్తుండగా.. సీకే నాయుడు అండర్-23 టోర్నీలో భాగంగా తమిళనాడుతో ఢిల్లీ జట్టు శుక్రవారం కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. కానీ.. అతను సెలవుపై వెళ్లడం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. వీళ్లతో పాటు మాస్టర్ బ్లాస్లర్ సచిన్ తెందుల్కర్, సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్.
అనుష్క ఏం తీసిపోలేదు
విరాట్ తరపున కొందరు హాజరవుతున్నానుకుంటే, అనుష్క శర్మ వైపు నుంచి అనుష్క శర్మ కుటుంబం హాజరవుతుంది. ఇంతేగాక, అనుష్క, షారుఖ్ఖాన్, అమీర్ఖాన్, ఆదిత్య చోప్రా, డైరక్టర్ మనీశ్ శర్మలను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. అసలు నాలుగు నెలల క్రితమే డిసెంబరులో కోహ్లీ-అనుష్క వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు.
వేడుక పూర్తయ్యాక
ఇది పెళ్లి అని కొందరంటే, కాదు నిశ్చితార్థం అని కొందరంటున్నారు. ఇప్పటికే సన్నిహితులందరూ మిలాన్ చేరుకున్నారని తెలుస్తోంది. వేడుక ముగిశాక అధికారిక ప్రకటన చేస్తారంటూ, స్వదేశానికి వచ్చాక డిసెంబరు 21 లేదా 22న ప్రముఖులకు ముంబైలో భారీ విందు ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.
అర్థం కానీ ప్రశ్న
ఇంతకీ ఇది పెళ్లి వేడుకైనా, నిశ్చితార్థం తంతైనా ఎందుకు ఇంత గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారనేది. అర్థం కానీ ప్రశ్న. విషయం ఏదైనా విరాట్ కోహ్లీ మూడు వారాల తర్వాత దక్షిణాఫ్రికా టూర్కు హాజరుకానున్నాడు.