హైదరాబాద్: భారత్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒక్కటయ్యారా? అంటే అవుననే అనిపిస్తోంది. కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి ముంబైలోని బాంద్రాలో గల ఓ రెస్టారెంటులో మీడియాకు చిక్కాడు.

దీంతో, ఇరువురు తిరిగి ఒక్కటైనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ముంబైలోని రెస్టారెంటులో వారు కనిపించారంటున్నారు. ఇటీవలి వరకు వారు సింగిల్గా కనిపించారు. విభేదాలు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ కలిసిపోయినట్లుగా కనిపిస్తోంది.
ముంబైకి చెందిన ఓ వెబ్ సైట్ కథనం ప్రకారం... కోహ్లీ, అనుష్క మళ్లీ జత కలిశారు. ఓ రెస్టారెంటుకు ఇటీవల కలిసి వచ్చిన ఈ జంట ఎదురెదురుగా కూర్చుని విందును ఆరగించారు. ఈ వార్తలు మున్ముందు మైదానంలో కోహ్లీ వీర విహారం చేస్తుంటే... స్టాండ్స్లో నుంచి అనుష్క చేయి ఊపే దృశ్యాలు కనిపించవచ్చు.