హైదరాబాద్: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు సంబంధించిన హనీమూన్ సెల్ఫీ శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిసెంబర్ 11న ఇటీలీలోని టస్కానీలో పెళ్లి చేసుకున్న వీరిద్దిరూ ఆ తర్వాత హనీమూన్ కోసం రోమ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోమ్లో ఉన్న ఈ జంట సెల్ఫీ దిగి అభిమానుల కోసం షేర్ చేశారు.
ఈ సెల్ఫీని అనుష్క శర్మ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. 'స్వర్గంలో ఉన్నట్లు ఉంది' అంటూ కామెంట్ పెట్టింది. అనుష్క తన ఫేస్ బుక్లో పోస్టు చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫోటోకి కొన్ని లక్షల్లో లైక్లు వచ్చాయి. డిసెంబర్ 21న ఢిల్లీలో.. డిసెంబర్ 26న ముంబైలో ప్రముఖులకు రిసెప్షన్ ఇవ్వనున్నారు.
ఇప్పటికే రిసెప్షన్కు సంబంధించిన ఇన్విటేషన్లు పలువురు ప్రముఖులకు వెళ్లాయి. ఈ ఇన్విటేషన్ను విరాట్ కోహ్లీ తన అభిరుచికి తగ్గట్లుగా సింపుల్గా కాకుండా.. ఓ గిఫ్ట్ బాక్స్లాగా అతిథులకు అందజేశాడు. ఆ గిప్ట్ బాక్సులో ఓ మొక్కని కూడా ఏర్పాటు చేశారు. రిసెప్షన్ ఆహ్వానపత్రికలో అతిథులకు మొక్కలు పంపడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.