రెస్ట్ ఇన్ పీస్ బ్రూనో:
'11 ఏళ్ల మన ప్రయాణం జీవితాంతం ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ఎప్పుడు నీ ప్రేమను మాపై కురిపించావు. ఈ రోజు ఇక్కడి నుంచి వేరు చోటుకు వెళ్లావు. నీ ఆత్మకు శాంతి చేకూరేలాని ఆ దేవుడుని కోరుకుంటున్నా. రెస్ట్ ఇన్ పీస్ బ్రూనో' అంటూ కోహ్లీ ఉద్వేగభరిత ట్వీట్ చేశాడు. అనుష్క శర్మ కూడా బ్రూనో ఆత్మకి శాంతి చేకూరాలని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. 'మిస్ యూ బ్రూనో.. రిప్' అని పేర్కొంది.
బ్రూనో అంటే ఎంత ఇష్టమో:
ఇక విరాట్ కోహ్లీకి బ్రూనో అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒత్తిడి తగ్గించుకోవడానికి బ్రునోతో ఆడుకునేవాడినని కోహ్లీ ఎన్నో సార్లు చెప్పాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో బ్రూనోతో దిగిన ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తుండేవాడు. మరోవైపు అనుష్కకు కూడా బ్రూనోతో మంచి బంధమే ఉంది. అమె కూడా బ్రూనోతో దిగిన ఫోటోలను తరుచు తన ఇన్స్టాలో షేర్ చేస్తుండేది.
శునకాలంటే ఇష్టం:
విరాట్ కోహ్లీకి శునకాలంటే చాలా ఇష్టం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమయంలో బెంగళూరులోని శునకాల సంరక్షణ కేంద్రాన్ని తరచూ సందర్శించే కోహ్లీ.. అక్కడ కొన్ని శునకాలని దత్తత కూడా తీసుకున్నాడు. ఇక మ్యాచ్లు ఆడే సమయంలో స్టేడియంలోకి తనిఖీల కోసం పోలీసులతో పాటు వచ్చే శునకాలతో కోహ్లీ ఆడుకుంటూ చాలాసార్లు కనిపించాడు.
ఐపీఎల్ నిరవధిక వాయిదా:
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడడంతో.. విరుష్క జోడి ఇంటికే పరిమితమైంది. కరోనా వైరస్పై యుద్ధం చేసేందుకు, లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు నిర్వహిస్తున్న ఆన్లైన్ సంగీత విభావరిలో విరాట్ కోహ్లీ పాల్గొననున్నాడు. కరోనాపై పోరు కోసం పీఎం-కేర్స్ ఫండ్, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి కోసం విరుష్క జోడి నిధులు అందించనున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.