
హైదరాబాద్: భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కల పెళ్లి సస్పెన్స్గా జరిగింది. జరగకముందు జరుగుతుందా లేదా అనే సందిగ్ఘం జరిగాక ఎలా జరిగిందోనన్న ఆరాటం సాధారణ అభిమాని నుంచి సహచర వర్గం వరకు వారి గురించి తెలసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ జంట గురించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
బంధు మిత్రలు సమక్షంలో ఇటలీలో వివాహం చేసుకున్న జంట చెట్టాపట్టాలేసుకుని హనీమూన్కు చెక్కేసింది. రోమ్ నగరంలో హనీమూన్ ముగించుకుని మంగళవారం దేశ రాజధానికి చేరకుంది. తన స్వగృహానికి శ్రీమతిని తీసుకువెళ్లిన కోహ్లీ వారి మిత్రులతో మాట్లాడుతుండగా తీసిన ఫొటో ఇప్పుడు వైరల్గా మారింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.