లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్ సెమీఫైనల్లో అడుగు పెట్టింది భారత క్రికెట్ జట్టు. శ్రీలంకతో మరో మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ.. సెమీస్లో తన బెర్త్ను ఖాయం చేసుకుంది. ప్రపంచకప్లో తన చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకను ఢీ కొట్టబోతోంది.
శనివారం ఈ మ్యాచ్ లీడ్స్లోని హెడింగ్లే స్టేడియంలో ఆరంభం కానుంది. టీమిండియా సెమీఫైనల్లో అడుగు పెట్టడంతో ప్రస్తుతం జట్టు ఆటగాళ్లందరూ కాస్త రిలాక్స్ మూడ్లో కనిపిస్తున్నారు. ఎవరికి నచ్చిన విధంగా వారు కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో- టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ చాలాకాలం తరువాత సోషల్ మీడియా ప్లాట్ఫాంపై కనిపించారు.
Seal the silly moments ❣️ pic.twitter.com/9fkX54OsIa
— Anushka Sharma (@AnushkaSharma) July 3, 2019
తన భార్య, బాలీవుడ్ నటి అనూష్క శర్మతో కలిసి దిగిన రెండు ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దానికి మిస్టర్ అండ్ మిసెస్..! అని ట్యాగ్ జత చేశారు. అదే సమయంలో అనూష్క శర్మ కూడా ఓ పిక్ను తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్గా మారిపోయాయి. సోషల్ మీడియాకు హాట్ టాపిక్గా చిక్కాయి.
365 రోజులు..2036 మ్యాచ్లు: ఇక దేశవాళీ క్రికెట్ పండగ