బెంగళూరుకు చివరి మ్యాచ్:
ఈ సీజన్-12లో బెంగళూరు ఆడిన తొలి ఆరు మ్యాచుల్లో విజయమే సాధించలేదు. ఏడవ మ్యాచులో విజయం వరించినా.. మళ్ళీ తర్వాతి మ్యాచులో ఓడింది. బెంగళూరు అప్పటి నుండి పడుతూ లేస్తూ.. 13 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను వదులుకుంది. అయితే ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరుకు సీజన్లో చివరి మ్యాచ్. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు.
ఆ మ్యాచ్ ఎప్పటికి మరిచిపోలేను:
'ఈ సీజన్లో విఫలమయ్యాం. వచ్చే సీజన్లో కచ్చితంగా మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. దానికి మీ మద్దతు ఎంతో ముఖ్యం' అని కోహ్లీ అభిమానులను కోరాడు. 'ఈ సీజన్ మాకు కలిసి రాలేదు. గెలవాల్సిన మ్యాచ్లలో కూడా ఓడిపోయాం. రాజస్థాన్తో జరిగిన ఆ ఐదు ఓవర్ల మ్యాచ్ ఎప్పటికి మరిచిపోలేను. ఫలితం రాకపోయినప్పటికీ ఆ మ్యాచ్ను నా జీవితంలో గుర్తుండిపోతుంది' అని డివిలియర్స్ చెప్పాడు.
అంచనాలు అందుకోలేకపోయాం.. క్షమించండి:
'చాలా బాధగా ఉంది. అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించండి. బెంగళూరు జట్టును ప్లేఆఫ్స్కు తీసుకెళ్లడంలో జట్టుగా విఫలమయ్యాం. అయినా కూడా మా వెంటనే ఉంటున్నందుకు మీకు కృతజ్ఞతలు. వచ్చే సీజన్లో కచ్చితంగా రాణిస్తాం. అప్పుడు కూడా మీ మద్దతు కావలి' అని ఓ భావోద్వేగపూరిత వీడియోను బెంగళూరు యాజమాన్యం ట్విటర్లో పోస్టు చేసింది.