
హైదరాబాద్: ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఫొటో నెట్టింట్లో వైరల్గా మారింది. అది మరెవరిదో కాదు. అచ్చం రవిశాస్త్రిని పోలి ఉన్న ఓ ఫొటో ఒకటి ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుత భారత జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తోన్న రవిశాస్త్రిపై సాధారణంగానే ఏదో ఒక ఫొటో పెట్టి ట్రోల్ చేసే నెటిజన్లు.. ఈ ఫొటోపై విస్తృతంగా కామెంట్లు చేస్తున్నారు. అంతటితో ఆగలేదు అతనితో పాటు కెప్టెన్ కోహ్లీని కలిపి ట్వీట్ చేస్తున్నారు.
ఈ వ్యక్తి పేరు వర్మ.. ఊరు ముంబై. సబర్బన్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా తీసిన ఫొటో ఇది. ఫన్నీ మెమ్స్, ట్రోల్స్తో రచ్చ రచ్చ చేస్తున్నారు. సాధారణంగా నవ్వులు తెప్పిస్తున్న ట్వీట్లలో మచ్చుకు కొన్ని..
రవిశాస్త్రి ప్రపంచ కప్ ముందెలా ఉన్నాడంటే.. పాపం తర్వాత ఇలా అయిపోయాడు.
నువ్వు విండో సీట్ దొరికిందని ఆనందపడటం.. కానీ, కొంతసేపటికే అది ముంబై లోకల్ కాదని తెలిస్తే ఇలానే బాధపడతాం.
టీమిండియా మ్యాచ్ ఆడుతున్న రోజున కోహ్లీ ఆడకుండా ఉంటే రవిశాస్త్రి రియాక్షన్ ఇది.
బీసీసీఐ ట్రావెలింగ్ ఖర్చులు ఇవ్వను అన్నప్పుడు రవిశాస్త్రి పరిస్థితి
రోహిత్ శర్మ శాశ్వత కెప్టెన్ అయ్యాడని ఇలా..
1990వ దశాబ్దం తొలినాళ్లలో..
రవిశాస్త్రి దీపావళికి ఇంటికి వెళ్తున్నాడు.
విరాట్ కోహ్లీ రవిశాస్త్రిని తాగడానికి పిలవని పరిస్థితుల్లో స్పందన ఇది.