
భారత్-పాక్ మ్యాచ్పై
భారత్-పాక్ మ్యాచ్పై వినోద్ రాయ్ మాట్లాడుతూ "మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. జూన్ 16 మ్యాచ్పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఐసీసీకి ప్రధానంగా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాం. టోర్నీ సందర్భంగా ఆటగాళ్లకు మరింత భద్రత కల్పించాలని, ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న దేశాలతో సంబంధాలు తెంపుకోవాలని ఐసీసీని కోరుతున్నాం. హోంమంత్రి వ్యాఖ్యలపై నేనేమీ స్పందించను. జూన్ 16కు ఇంకా చాలా రోజులు ఉంది" అని అన్నారు.

ఐపీఎల్కే ప్రత్యేక ఆకర్షణగా
ఐపీఎల్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రారంభోత్సవాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ ప్రకటించారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల గౌరవార్థం ఐపీఎల్ వేడుకలు రద్దుచేశామని ఆయన తెలిపారు. ఆరంభ వేడుకలకు కార్యక్రమానికి కేటాయించిన డబ్బును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందిస్తామని బీసీసీఐ క్రికెట్ పాలకుల కమిటీ ఈ సమావేశంలో నిర్ణయించింది.

పీఎల్ ఆరంభ వేడుకలు రద్దు
"ఈ సారి ఐపీఎల్ ఆరంభ వేడుక నిర్వహించడం లేదు. అందుకు కేటాయించిన డబ్బును అమరుల కుటుంబాలకు అందజేస్తాం" అని వినోద్ రాయ్ తెలిపారు. వాస్తవానికి అమర జవాన్ల కుటుంబాలకి రూ. 5 కోట్లు తగ్గకుండా బీసీసీఐ తరఫున ఆర్థిక సాయం అందించేందుకు అనుమతించాలని వినోద్ రాయ్కి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా లేఖ రాశాడు.

అమరుల కుటుంబానికి ఎక్కువ మొత్తాన్ని
దీనిపై శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించిన బోర్డు సభ్యులు.. అంతకంటే ఎక్కువ మొత్తాన్నే ఇచ్చేందుకు అంగీకరించారు. 2018 ఐపీఎల్ సీజన్ ఆరంభోత్సవానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బడ్జెట్లో రూ.50 కోట్లను తొలుత కేటాయించగా.. ఆ మొత్తాన్ని రూ.30 కోట్లకి బీసీసీఐ పాలకుల కమిటీ తగ్గించింది. గతేడాది ఈ మొత్తాన్ని రూ.20 కోట్లకు తగ్గించింది.

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్
మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుండగా.. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. టోర్నీ నిర్వాహకులు రెండు వారాల షెడ్యూలును మాత్రమే విడుదల చేశారు. 17 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ని బీసీసీఐ తన ట్విట్టర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications

