హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి తండ్రి గణ్పత్ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కాంబ్లి తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
'ఇన్నాళ్లు నా వెనుక నిల్చుని, నన్ను వెన్నుతట్టి పోత్సహించి, నేను క్రికెట్ ఆడేందుకు స్ఫూర్తినిచ్చిన నా తండ్రి గణ్పత్ ఇక లేరు. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు. మిస్ యూ. థాంక్యూ నాన్న. లవ్ యూ. మీ కుమారుడు వినోద్' అంటూ కాంబ్లి ట్విట్టర్లో పోస్టు చేశాడు.
ఈ సందర్భంగా తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తి చేసుకుంటూ కొన్ని ఫొటోలను కాంబ్లి అభిమానులతో పంచుకున్నాడు. కాంబ్లి తండ్రి మరణవార్త తెలుసుకున్న అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. 1991లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కాంబ్లి 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.