Vijay Zol Story: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ తరఫున 35 బంతుల్లో సెంచరీ కొట్టడం ద్వారా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ప్రపంచం అతడిని అంతర్జాతీయ స్థాయిలో కొత్త స్టార్గా చూడటం ప్రారంభించింది. కేవలం 14 సంవత్సరాల వయస్సు ఉన్న వైభవ్ సూర్యవంశీ.. టీ20 సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా విజయ్ జోల్ రికార్డును బద్ధలు కొట్టాడు. ఇప్పుడు విజయ్ జోల్ ఎవరు అని ఆలోచిస్తున్నారా.. విజయ్ జోల్ 2014 అండర్-19 ప్రపంచ కప్లో భారత జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. ఈ టోర్నమెంట్లో శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, సర్ఫరాజ్ ఖాన్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా వంటి స్టార్లు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు. ఐపీఎల్లో గొప్ప ఆటగాళ్లుగా నిలిచారు.
చిన్నవయసులోనే అనేక రికార్డులు సృష్టించిన విజయ్ జోల్
మహారాష్ట్రకు చెందిన విజయ్ జోల్ అండర్-19 రోజుల్లో చాలా పరుగులు చేశాడు. మహారాష్ట్ర తరఫున జరిగిన అండర్-19 మ్యాచ్లో 467 బంతుల్లో అజేయంగా 451 పరుగులు చేయడం ద్వారా విజయ్ జోల్ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అందరి కళ్లు విజయ్ జోల్ పైనై పడ్డాయి. విజయ్ జోల్ చాలా చిన్న వయసులోనే భారత అండర్-19 జట్టులో చేరాడు. విజయ్ జోల్ రెండు అండర్-19 ప్రపంచ కప్లలో ఆడిన కొద్ది మంది క్రికెటర్లలో ఒకడు. 2014లో అండర్-19 కెప్టెన్ గా నియమితుడయ్యాడు. అయితే విజయ్ జోల్ కెప్టెన్ గా బాగా రాణించలేదు. భారత్ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయింది.

ఫస్ట్-క్లాస్ అరంగేట్రంలోనే సెంచరీ
విజయ్ జోల్ ఇండియా-ఏ తరఫున ఆడుతున్నప్పుడు న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో అరంగేట్రం చేసి సెంచరీ సాధించాడు. విజయ్ జోల్ను 2012లో ఆర్సీబీ కొనుగోలు చేసింది కానీ ఆడే అవకాశం రాలేదు. తర్వాత ఆర్సీబీ అతడిని 2014 వేలంలో తిరిగి కొనుగోలు చేసింది. విజయ్ జోల్ ఐపీఎల్ ఏడో సీజన్ లో కొన్ని మ్యాచ్లు ఆడాడు. విజయ్ జోల్ మహారాష్ట్రకు చెందిన ఒక మంచి క్రికెటర్. కేవలం 18 సంవత్సరాల వయస్సులోనే టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. చిన్న వయస్సులోనే క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు.
ఫామ్ కోల్పోయాడు.. క్రికెట్ నుంచి అదృశ్యం
విజయ్ జోల్ 2012లో అండర్-12 ప్రపంచ కప్ గెలిచాడు. ఆ సమయంలో ఆ జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్. విజయ్ జోల్ 2013-13 రంజీ ట్రోఫీ సీజన్లో మహారాష్ట్ర తరఫున 9 మ్యాచ్లు ఆడాడు. ఇందులో విజయ్ జోల్ త్రిపురపై అజేయంగా 200 పరుగులు చేశాడు. ఆ తర్వాత విజయ్ జోల్ ఫామ్ ను కోల్పోతూ వచ్చాడు. విజయ్ జోల్ అభ్యంతరకరమైన భాషను ఉపయోగించినందుకు విజయ్ జోల్పై సస్పెన్షన్ విధించబడింది. ఒక మ్యాచ్ నిషేధం విధించబడింది. పేలవమైన ఫామ్, గాయాల కారణంగా విజయ్ జోల్ మహారాష్ట్ర రంజీ ట్రోఫీ జట్టులో స్థానం కోల్పోయాడు. అందుకే విజయ్ జోల్ నవంబర్ 2019లో హర్యానాపై తన చివరి ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. అప్పటి నుంచి విజయ్ జోల్ దేశీయ మ్యాచ్ ల నుంచి అదృశ్యమయ్యాడు. ఇప్పుడు విజయ్ జోల్ వయసు ఇప్పుడు కేవలం 30 సంవత్సరాలు. విజయ్ జోల్ సహచరులు అంతర్జాతీయ క్రికెట్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుటీకీ విజయ్ జోల్ అజ్ఞాతంలో జీవిస్తున్నాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి కూడా ఇలా జరుగుతుందేమో అనే భయం ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు పూర్తిగా రాహుల్ ద్రవిడ్ చేతుల్లోనే ఉంది. ద్రవిడ్ కు అలాంటి ప్రతిభను ఎలా పెంపొందించాలో తెలుసు. కాబట్టి అలాంటి భయాలు అవసరం లేదనిపిస్తోంది.