రాంచీ: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 15మంది సభ్యుల జార్ఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 10 నుంచి 18 వరకు ఈ ట్రోఫీ బెంగళూరులో జరగనుంది.
కాగా, జార్ఖండ్ జట్టుకు వరుణ్ ఆరోన్ కెప్టెన్సీగా వ్యవహరిస్తున్నాడు. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్(జెఎస్సిఏ) సెక్రటరీ రాజేష్ వర్మ మాట్లాడుతూ.. వరుణ్ ఆరోన్ జార్ఖండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడని, ఆ జట్టులోనే ధోనీ ఆడతాడని చెప్పారు.

ధోనీ ఈ ట్రోఫీతో దేశీయ మ్యాచుల్లో 8ఏళ్ల తర్వాత మళ్లీ అరంగేట్రం చేస్తున్నాడు. డిసెంబర్ 8న ధోనీ జార్ఖండ్ జట్టు సభ్యులతో బెంగళూరుకు చేరుకోనున్నాడు. కాగా, కర్ణాటక, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, రైల్వేస్, కేరళ జట్లతో జార్ఖండ్ జట్టు తలపడనుంది.
జార్ఖండ్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ, సుమిత్ కుమార్, ఇషాంక్ జగ్గి, సౌరవ్ తివారీ, ఆనంద్ సింగ్, కుమార్ దేవబ్రత్, కౌశల్ సింగ్, వరుణ్ ఆరోన్(కెప్టెన్), రాహుల్ శుక్లా, షబాజ్ నదీమ్, సోనూ సింగ్, మోనూ కుమార్, ఎస్పి గౌతమ్, అంకిత్ దబాస్, జాస్కరణ్ సింగ్.