హైదరాబాద్: స్పోర్ట్స్ జర్నలిజంలో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఓ జర్నలిస్ట్కు అరుదైన గౌరవం లభించింది. కెరీర్లో వందో టెస్టుని కవర్ చేస్తున్న క్రికెట్ జర్నలిస్ట్, విజ్డెన్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ ఆర్ కౌషిక్కు టీమిండియా జెర్సీని కెప్టెన్ విరాట్ కోహ్లీ బహుమతిగా ఇచ్చాడు.
మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా గురువారం రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ ఈ అరుదైన గిఫ్ట్ను కౌషిక్కు బహుమతిగా ఇచ్చాడు. అనంతరం కోహ్లీ అతడిని పొగడ్తల్లో ముంచెత్తాడు.
'ఇదో గొప్ప ఘనత. క్రికెట్ను సరిగ్గా విశ్లేషించే వాళ్లలో మీరూ ఒకరు. ఎలాంటి మసాలా వార్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. క్రికెట్ను క్రికెట్లాగా చూసేవాళ్లలో మీరూ ఒకరు. ఈ జెర్సీని మీకు అందించడం గౌరవంగా భావిస్తున్నా' అని విరాట్ కోహ్లీ అన్నాడు.
— Vijay Lokapally (@vijaylokapally) 2 August 2017