హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో పలువురు క్రికెటర్లు సత్తా చాటుతూ వెలుగులోకి వస్తున్నారు. తాజాగా కాన్పూర్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ లయన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒంటి చేత్తో సిక్స్ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలువైపులా బౌండరీలతో చెలరేగాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదాడు. ఈ భారీ షాట్ ఆడే క్రమంలో అతడు కుడి చేయి బ్యాట్పై పట్టుకోల్పోయాడు.
అయినా సరే బ్యాట్ మిడిల్లో తాకిన బంతి బౌండరీ లైన్ అవల పడింది. ఇషాన్ కిషన్ ఆ సిక్సర్తోనే కేవలం 27 బంతుల్లో ఐపీఎల్లో తొలి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో భారీ షాట్ కోసం ప్రయత్నించి కిషన్ (40 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సులు) అవుటయ్యాడు.
ఓపెనర్లు ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 61; 5x4, 4x6), డ్వేన్స్మిత్ (33 బంతుల్లో 54; 7x4, 2x6) అర్ధసెంచరీలతో రాణించడంతో గుజరాత్ 19.2 ఓవర్లలో 154 పరుగులు చేసింది.