ఓపెనర్లుగా గిల్, రోహిత్:
వెంకటేష్ ప్రసాద్ ప్రకటించిన జట్టులో దాదాపు అందరూ ఊహించినవారే ఉండగా.. ఇద్దరు తెలుగు ఆటగాళ్లు హనుమ విహారి, మొహ్మద్ సిరాజ్లకు చోటు దక్కలేదు. పిచ్తో సంబంధం లేకుండా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఈ జట్టు అత్యుత్తమం అని వెంకటేష్ ట్వీట్ చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ క్రాకింగ్ గేమ్ అని పేర్కొన్నాడు. ఓపెనర్లుగా శుబ్మాన్ గిల్ మరియు రోహిత్ శర్మలను అతడు ఎన్నుకున్నాడు. అందరిలానే మయాంక్ అగర్వాల్ను వెంకటేష్ పట్టించుకోలేదు. చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ మరియు అజింక్య రహానేలకు వరుసగా అవకాశం ఇచ్చాడు.
సిరాజ్కు షాక్:
ఆరవ స్థానంలో హనుమ విహారికి బదులుగా రిషబ్ పంత్ను వెంకటేష్ ప్రసాద్ తీసుకున్నాడు. ఏడో స్థానంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు అవకాశం ఇవ్వగా.. 8వ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ను తీసుకున్నాడు. వెంకటేష్ ఇద్దరు స్పిన్నర్లకు జట్టులో చోటు కల్పించాడు. ఇక మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మలను పేస్ విభాగంలో ఎంచుకున్నాడు. దీంతో హైదరాబాద్ గల్లీ బాయ్ మొహ్మద్ సిరాజ్కు షాక్ తగిలింది. నిజానికి ఒకటి, రెండు మార్పులు తప్పితే.. దాదాపు డబ్ల్యూటీసీ ఫైనల్ ఇదే జట్టు ఆడనుంది.
నెట్స్లో ముమ్మర సాధన:
తొలి టెస్ట్ చాంపియన్షిప్ను సొంతం చేసుకోవడానికి భారత్, న్యూజిలాండ్ జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సౌథాంప్టన్లోని ఎజియస్ బౌల్ స్టేడియంలో ఈ రెండు టీమ్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను ఐసీసీ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడటానికి రెండు వారాల కిందటే అక్కడికి వెళ్లిన కోహ్లి సేన.. కొన్నాళ్లు క్వారంటైన్ తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించింది. నెట్ ప్రాక్టీస్తోపాటు టీమ్ రెండుగా విడిపోయి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా చేసింది. ఇప్పటికే ఈ ఫైనల్ వార్ కోసం 15 మంది సభ్యుల టీమ్ను బీసీసీఐ ప్రకటించింది. వీళ్లలో బరిలోకి దిగబోయే తుది 11 మంది ఎవరనేది మ్యాచ్కు ముందే తేలనుంది. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా లేక నలుగురు పేసర్లతోనా అన్నది తేలాల్సి ఉంది.
వెంకటేష్ ప్రసాద్ ప్లేయింగ్ లెవెన్:
రోహిత్ శర్మ, శుభ్మన్గిల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ.