CSK vs RR: ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సీజన్లో ఇది రాజస్థాన్ రాయల్స్కు చివరి మ్యాచ్ కాగా.. వారు 6 వికెట్ల తేడాతో గెలిచారు. ఈ మ్యాచ్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మ్యాజిక్ మరోసారి కనిపించింది. మొదట వైభవ్ సూర్యవంశీ సీఎస్కే బౌలర్లకు బ్యాట్తో గుణపాఠం నేర్పించాడు. మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీ చేసిన పనికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ధోని పాదాలను తాకిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2025లో వైభవ్ సూర్యవంశీ అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు కాగా.. ఎంఎస్ ధోని అతిపెద్ద వయస్కుడైన ఆటగాడు. అందరూ ఎంఎస్ ధోనిని గౌరవిస్తారు. మరి వైభవ్ సూర్యవంశీ తనకు ఇష్టమైన ధోనిని కూడా అలాగే గౌరవించాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్నప్పుడు ఎంఎస్ ధోని వైభవ్ సూర్యవంశీ ముందుకు రాగానే ఈ యువ ఆటగాడు ఆయన పాదాలను తాకాడు. ధోని కూడా చిరునవ్వుతో వైభవ్తో కరచాలనం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను అందరూ లైక్ చేస్తుండగా.. అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ
ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్తో అభిమానులను ఆకట్టుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ సీఎస్కే బౌలర్లను ఆట ఆడుకున్నాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ..33 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
ముగిసిన రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం ఇప్పుడు ముగిసింది. ఈ సీజన్ రాజస్థాన్ కు చాలా దారుణంగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలవగలిగింది. రాజస్థాన్ 10 మ్యాచ్ల్లో పరాజయాలను ఎదుర్కోవలసి వచ్చింది.