ఢాకా: అండర్-19 ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచులో వెస్టిండీస్ విజయం సాధించి టోర్నీ సొంతం చేసుకుంది. చివరి వరకు పోరాడిన కార్టీ, పాల్ తమ జట్టును విజయాన్నందించారు.
మ్యాచ్ వివరాలు: భారత్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు పోప్ 3, ఇమ్లచ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం హెట్మెర్ 23 పరుగుల వద్ద ఔట్ కాగా, స్ప్రంగర్ 3 పరుగులకే వెనుదిరిగాడు.
3పరుగులు చేసిన గూలీ దాగర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయిన విండీస్ 49ఓవర్లకు 143 పరుగులతో ఆట కొనసాగిస్తోంది. కార్టీ 51, పాల్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ప్రారంభం నుంచి తడబడింది. ఓపెనర్లుగా వచ్చిన ఆర్ఆర్ పంత్(1), ఇషాంత్ కిషన్(4) వెంటవెంటనే వెనుదిరిగారు.
ఆ తర్వాత అన్మోల్ ప్రీత్ సింగ్ 3, వాషింగ్టన్ సుందర్ 7, అర్మాన్ జాఫర్ 5 పరుగులకే వెనుదిరిగారు. ఎంకె లామ్రర్ 19 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం ఎస్ఎన్ ఖాన్ 51 పరుగులతో రాణించి.. జాన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దాగర్ 8 పరుగులకు ఔటయ్యాడు.
ప్రస్తుతం ఆర్ఆర్ బాథమ్ 21, ఆవేష్ ఖాన్ 1 పరుగులు చేసి వెనుదిరిగారు. దీంతో భారత్ 45.1 ఓవర్లలో కేవలం 145 పరుగులు చేసి ఆలౌటైంది.
కాగా, బంగ్లా బౌలర్లలో జోఫెస్, జాన్ చెరో 3 వికెట్లు పడగొట్గగా, పాల్ 2, హోల్డర్, స్పింగర్ తలో వికెట్ తీశారు.