జీవితకాల నిషేధం?:
అవినీతి నిరోధక కోడ్లోని పలు ఉల్లంఘనలకు పాల్పడినందున ఉమర్ అక్మల్కు పీసీబీ నోటీసులు జారీ చేసింది. ఫిక్సింగ్కు సంబంధించిన విషయాలను ఉద్దేశపూర్వకంగా బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేయనందున ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మార్చి 31 లోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ అక్మల్ చెప్పే కారణాలతో పీసీబీ సంతృప్తి చెందకపోతే.. అతడిపై ఆరు నెలల నుంచి గరిష్టంగా జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది.
ఊహించని షాక్:
గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ తరపున అక్మల్ చివరిసారి ఆడాడు. ఆ సిరీస్లో అక్మల్ విఫలం కావడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్ జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడేందుకు సిద్దమయ్యాడు. కానీ.. ఇంతలోనే పీసీబీ అతనికి ఊహించని షాక్ ఇచ్చింది.
అడ్వాన్స్ తిరిగివ్వాలని:
అయితే పీఎస్ఎల్ 2020 సీజన్లో తమ ఫ్రాంచైజీ తరఫున ఆడేందుకు అక్మల్తో ఒప్పందం కుదుర్చుకున్న క్వెట్టా గ్లాడియేటర్స్.. తాము చెల్లించిన అడ్వాన్స్ మొత్తం తిరిగివ్వాలని స్పష్టం చేసింది. దీంతో అక్మల్కు మరో తలనొప్పి ఎదురైంది.,టోర్నీకి ముందే క్వెట్టా గ్లాడియేటర్స్ పేమెంట్లో 70 శాతాన్ని అతనికి అందజేసింది. కానీ.. అతనిపై సస్పెన్షన్ వేటు పడటంతో ఆ డబ్బుని వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చేయాలని గ్లాడియేటర్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు పీఎస్ఎల్ నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు విన్నవించింది.