హైదరాబాద్: ఫిబ్రవరి 13న ఇద్దరు క్రికెటర్లను అరెస్టు చేసినట్లు బ్రిటన్ నేషనల్ క్రైం ఏజెన్సీ (ఎన్సీఏ) అధికారులు వెల్లడించారు. అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టగా ఏప్రిల్ వరకూ గడువు ఇస్తూ వారికి బెయిల్ మంజూరు చేసినట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో పీసీబీ గతవారంలో ఇస్లామాబాద్ యూనైటెడ్ ప్లేయర్ షార్జిల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పీసీబీ అవినీతి నిరోధక విభాగం తమకు ఫిక్సింగ్ ఆటగాళ్ల వివరాలను వెల్లడించిందని, ఫిక్సర్లపై చర్యలు తీసుంటామని పీఎస్ఎల్ చైర్మన్ నజీమ్ సెతీ అన్నారు.

మరోవైపు తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో సంబంధం ఉన్న పాకిస్థాన్ ఓపెనర్ నాసిర్ జంషెడ్ను బ్రిటన్కు చెందిన నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అరెస్టు చేసింది. నాసిర్తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు ఏజెన్సీ స్పష్టం చేసింది.
ఏజెన్సీ అదుపులో ఉన్న వ్యక్తిని యూసఫ్గా గుర్తించినట్లు పీసీబీ ఛైర్మన్ షహర్యాన్ ఖాన్ అరే టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు. అనంతరం వారిద్దరూ బెయిల్పై విడుదలయ్యారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బుధవారం వెల్లడించింది. అయితే వారిద్దరికి సంబంధించి ఇతర విషయాలను వెల్లడించేందుకు పీసీబీ నిరాకరించింది.