చివరి రెండు వన్డేలకు ధోనికి విశ్రాంతి
అయితే, చివరి రెండు వన్డేల నుంచి ధోనికి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో మొహాలీ వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో రిషబ్ పంత్కు జట్టు మేనేజ్మెంట్ తుది జట్టులో చోటు కల్పించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్లో పంత్ 24 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 36 పరుగులతో ఫరవాలేదనిపించాడు.
మొహాలీ వన్డేలో నిరాశపరిచిన పంత్
అయితే, వికెట్ కీపింగ్లో మాత్రం నిరాశపరిచాడు. ఒక సునాయస క్యాచ్తో పాటు.. రెండు కీలక స్టంపౌట్లను చేజార్చి భారత విజయవకాశాలను దెబ్బతీశాడు. ఇందులో ఓ స్టంపౌట్ను ధోని స్టైల్లో చేయబోయి విఫలమయ్యాడు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ కీపింగ్ పట్ల.. మైదానంలోనే అసహనం వ్యక్తం చేశాడు.
ఓటమికి స్టంపౌట్, క్యాచ్లే కారణమన్న కోహ్లీ
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఓటమికి స్టంపౌట్, క్యాచ్లు చేజార్చుకోవడమేనని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ప్రదర్శనపై అభిమానులు సోషల్ మీడియా సైతం మండిపడుతున్నారు. భారత ఓటమికి పంతే కారణమని కామెంట్లు పెడుతున్నారు. "అంపైర్.. ఇప్పుడు పంత్ను మార్చవచ్చా" అని కోహ్లీ అడుగుతున్నట్లు ఉన్న మీమ్ ట్విట్టర్లో వైరల్ అయింది.
ప్రతి ఒక్కడు ధోని కాలేడు
"ప్రతి ఒక్కడు ధోని కాలేడు.. ధోని స్థానాన్ని భర్తీ చేసేవారే లేరు. అందుకే పంత్ను ప్రపంచకప్కు ఎంపిక చేయవద్దన్నది" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. రిషబ్ పంత్ కన్నా కీపింగ్లో దినేశ్ కార్తీక్ నయమని, అతని అనుభవం వరల్డ్కప్లో భారత జట్టుకు ఉపయోగ పడుతుందని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.