రాంచీ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో వన్డేలో ధోని మ్యాజిక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ను ధోని రనౌట్ చేసిన విధానం మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. వెనక్కి తిరగకుండానే వికెట్లపైకి నేరుగా బంతిని విసిరి రాస్ టేలర్ను ధోని రనౌట్ చేసిన విధానానికి ప్రపంచ క్రికెట్ మొత్తం ఆశ్చర్యపోయింది.

ఈ రనౌట్ ద్వారా భారత జట్టులోకి ఎంత మంది వికెట్ కీపర్లు వచ్చినా ధోని ఎందుకు ప్రత్యేకమో రాంచీ వన్డేలో మరోసారి నిరూపితమైంది. ఈ మ్యాచ్లో టీమిండియా 19 పరుగుల తేడాతో ఓటమి పాలైన రాస్ టేలర్ను అద్భుతమైన రీతిలో రనౌట్ చేయడం మాత్రం మ్యాచ్కే హైలెట్ గా నిలిచింది. ఈ రనౌట్పై ట్విట్టర్లో తెగ జోకులు పేలాయి.