For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2 పరుగుల తేడాతో 108 సంవత్సరాల రికార్డ్ మిస్: కోహ్లీ-జయంత్‌లపై ప్రశంసలు


 భారత్ - ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ - జయంత్ యాదవ్‌లు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరు ఎనిమిదో వికెట్‌కు 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ముంబై: భారత్ - ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ - జయంత్ యాదవ్‌లు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరు ఎనిమిదో వికెట్‌కు 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లీ 235 పరుగులు, జయంత్ 104 పరుగులు చేసి అవుటయ్యారు.

241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ - జయంత్‌ల జోడీ రెండు పరుగులతో శతాబ్దానికి పైగా ఉన్న రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని చేజార్చుకుంది.

 Twitterati hail Virat Kohli and Jayant Yadav as India scores 631 in the first innings

1908లో ఆస్ట్రేలియా జోరీ హర్టింగన్‌-హిల్స్‌ ఎనిమిదో వికెట్‌కు 243 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 108 సంవత్సరాలైనా ఆ రికార్డు చెక్కు చెదరలేదు. ఈ రికార్డుకు చేరువలోకి వచ్చిన కోహ్లి-జయంత్‌ జోడీ 241 పరుగుల వద్ద నిలిచిపోయింది.

ట్విట్టర్‌లో ప్రశంసల వెల్లువ

241 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ - జయంత్‌ల పైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ప్రశంసలు కురుస్తున్నాయి. జయంత్ యాదవ్ తన తొలి టెస్టు మ్యాచులో సెంచరీ చేయగా, కోహ్లీ టెస్టుల్లో రెండో డబుల్ సెంచరీ సాధించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+