ఆర్సీబీ వరుసగా నాలుగు
ఈ సీజన్ ఆరంభంలో ఫేవరేట్గా బరిలోకి దిగిన ఆర్సీబీ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోవడాన్ని అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లీ మార్చి 8 నుంచి వరుసగా 7 మ్యాచుల్లో ఓటమిపాలయ్యాడు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది.
ముంబై ఇండియన్స్తో
ఆ తర్వాత ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 181 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ ఓడిపోయింది. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 113 పరుగులకే ఆలౌటైంది. తద్వారా ఐపీఎల్లో సన్రైజర్స్ అత్యధిక పరుగులు (118) తేడాతో విజయం సాధించింది.
రాజస్థాన్ రాయల్స్తో
ఇక, మంగళవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ ఇప్పటివరకు 100 మ్యాచ్లాడగా అందులో 55 మ్యాచ్ల్లో ఓడగా.. 45 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అంతేకాదు గత పదకొండు సీజన్లలో ఒక్కసారిగా ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవలేకపోయింది.
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ... ఆ జట్టుని విజయాల్లో నడిపించలేకపోతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 70 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లీని తప్పించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications

