ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్మన్లా
ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్మన్లాగా ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఆసీస్ బౌలర్లు బౌన్సర్లతో బెంబేలెత్తించినా బెదరకుండా క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్ర టెస్ట్లోనే అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాట్స్మన్గా మయాంక్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 71 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టాడు.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన టెస్ట్లో
1947 డిసెంబర్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన టెస్ట్లో హాఫ్ సెంచరీ చేసిన దత్తు ఫాడ్కర్(51).. ఆసీస్ గడ్డపై ఆరంగేట్ర టెస్టులో హాఫ సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు మయాంక్ అగర్వాల్ (76) పరుగులతో ఆ రికార్డుని అధిగమించాడు. 27 ఏళ్ల మయాంక్ మెల్బోర్న్ టెస్ట్లో నిలకడగా ఆడాడు.
ఆత్మవిశ్వాసంతో కనిపించిన మయాంక్
క్రీజులో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తొలి రెండు టెస్టుల్లో భారత బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టిన స్పిన్నర్ నాథన్ లియాన్పై మయాంక్ ఎదురు దాడికి దిగాడు. ఓపెనర్ విహారితో కలిసి తొలి వికెట్కు 40 పరుగులు జోడించిన మయాంక్, పుజారాతో కలిసి రెండో వికెట్కు 83 పరుగులు జోడించాడు.
సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76), ఛటేశ్వర్ పుజారా (68) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 215/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర్ పుజారా(68), విరాట్ కోహ్లీ (47) పరుగులతో క్రీజులో ఉన్నారు. మయాంక్ ఇన్నింగ్స్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.