
మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం బీసీసీఐ సెలక్టర్లు భారత జట్టుని ఈ రోజు ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. తుది జట్టులో చోటు ఆశించిన అంబటి రాయుడుకి చుక్కెదురైంది. కేఎల్ రాహుల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇక బ్యాకప్ వికెట్ కీపర్గా సెలక్టర్లు దినేశ్ కార్తీక్ను ఎంపిక చేశారు. బ్యాకప్ వికెట్ కీపర్ విషయంలో గత కొంతకాలంగా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నా.. అనుభవం, ఒత్తిడిని తట్టుకోగల సామర్థ్యం ఉన్న దినేశ్ కార్తీక్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు. ప్రపంచకప్లో భారత ప్రధాన వికెట్ కీపర్గా ధోనీనే ఉన్నా.. ఏదైనా గాయం కారణంగా అతను మ్యాచ్లకు దూరమైతే వికెట్ కీపింగ్ బాధ్యతలను దినేశ్ కార్తీక్ మోయనున్నాడు.
అయితే ఇప్పుడు దినేశ్ కార్తీక్ ఎంపికపై భారత అభిమానులలో తీవ్ర చర్చ నడుస్తోంది. కొందరేమో దినేశ్ కార్తీక్ ఎంపిక సరైనదే అని అంటుంటే.. మరికొందరు రిషబ్ పంత్ ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదని మండిపడుతున్నారు. అభిమానుల ట్వీట్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేద్దామా.