హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం జరగనుంది. ఈ సిరిస్లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్లు గెలవడంతో సిరిస్ 2-2తో సమం అయింది. దీంతో ఆఖరి మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి.
'సగం కెప్టెన్ ధోనీనే, అతడు లేకపోతే కోహ్లీ మొరటుగా కనిపిస్తాడు'
ఐదో వన్డే కోసం తన సొంత నగరానికి చేరుకున్న విరాట్ కోహ్లీ.. ఇంట్లోని పెంపుడు శునకంతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఢిల్లీకి చేరుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఐదు వన్డేల ఈ సిరీస్లో హైదరాబాద్, నాగ్పూర్లో గెలిచిన భారత్ జట్టు ఆ తర్వాత.. రాంచీ, మొహాలిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
Touchdown Delhi 🐶 pic.twitter.com/AlvjeTLmNX
— Virat Kohli (@imVkohli) March 11, 2019
దీంతో సిరీస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో బుధవారం ఢిల్లీలో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది ఎలాగైనా సిరీస్ నెగ్గాలని ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికా ఆరంభమయ్యే వరల్డ్కప్కు ముందు భారత్కు ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం.