
నాలుగు రోజుల టెస్టు మ్యాచ్పై
"నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లకు నేను ఫ్యాన్ని కాదు. ఐదో రోజు ఎంతో కీలకం... ఇక్కడ ఆఖరి రోజున మీరు చాలా ఎక్కువ డ్రాలు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇందులో ఒకటి వాతావరణం. గతంతో పోలిస్తే ఈ రోజుల్లో వికెట్లు చాలా ప్లాట్గా ఉంటాయి. ఫలితంగా జట్లు ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడానికి అనుకూలం" అని లియోన్ చెప్పుకొచ్చాడు.

ఒత్తిడి తెచ్చేలా చేస్తుంది
"మరోవైపు ఒత్తిడి తెచ్చేలా చేస్తుంది. పిచ్ క్షీణించి స్పిన్నర్లకు అనుకూలంగా మారేందుకు గాను ఐదో రోజు అవసరం. దీనికి నేను పూర్తిగా వ్యతిరేకం. ఐసీసీ కూడా దీనిని పరిగణనలోకి తీసుకోలేదని నేను నమ్ముతున్నాను. ఐదు రోజుల టెస్టు అనేది ఓ ఛాలెంజ్. మీరు మిమ్మల్ని వివిధ మార్గాల్లో సవాల్ చేస్తారు - శారీరకంగా, మానసికంగా" అని నాథన్ లియోన్ అన్నాడు.

అసలేం జరుగుతుంది?
సంప్రదాయ క్రికెట్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. టెస్టులను నాలుగు రోజులకు పరిమితి చేసే ఆలోచనలో ఐసీసీ ఉంది. 2023-2031 షెడ్యూల్ నుంచి ఈ మార్పులు చేయనుంది. దీంతో బిజీగా ఉండే అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్లో ఆయా బోర్డులకు విరామం దొరుకుతుంది.

గ్లోబల్ ఈవెంట్స్ నిర్వహణకు
ఈ సమయంలో మరిన్ని గ్లోబల్ ఈవెంట్స్ నిర్వహణకు వీలవుతుందని ఐసీసీ ఆలోచన. 2023లో ముగియనున్న ప్రస్తుత భవిష్యత్ పర్యటనల ప్రణాళిక (ఎఫ్టీపీ) అనంతరం నాలుగు రోజుల మ్యాచ్లు అమల్లోకి వచ్చే అవకాశముంది. కాగా, అంతర్జాతీయ క్రికెట్లో నాలుగు రోజుల టెస్టులు కొత్తేం కాదు. ఇప్పటికే ఇలాంటి మ్యాచ్లు ఇంగ్లండ్-ఐర్లాండ్, దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య జరిగాయి.


Click it and Unblock the Notifications












