For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పురుష క్రికెట్‌లో అత్యధికంగా ఆర్జించేది కోహ్లీ, ధోనీ.. మరి భారత మహిళా క్రికెటర్లలలో ఎవరంటే!!

Top 5 highest earning India Women cricketers list, Mithali Raj on Top

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడలలో ఒకటి. ఈ క్రీడ గత కొన్ని సంవత్సరాలుగా నూతన దేశాలకు కూడా చేరుకుంది. జపాన్ జట్టు ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్‌లో పాల్గొనగా.. థాయిలాండ్‌ మహిళా జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2020కి అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. ఇరు జట్లు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక పోయినప్పటికీ.. క్రికెట్ త్వరలో ప్రపంచ క్రీడగా మారుతుందనే సంకేతాలు ఇచ్చాయి.

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ ఆస్ట్రేలియా- భారత్ మహిళా జట్లు పాల్గొననగా.. ఆసీస్ అద్భుతంగా ఆడి విశ్వ టోర్నీని కైవసం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ సేన ఫైనల్ చేరడంతో వేతనాల విషయం మరోసారి చర్చకు వచ్చింది. భారత మహిళలు ప్రపంచకప్‌ ఫైనల్ ఆడడంతో వారికి కూడా పురుషులలో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ పెరిగింది. అయితే పురుష క్రికెటర్ల సంపాదన గురించి చాలా మంది అభిమానులకు తెలుసు. మహిళల క్రికెటర్లు ఎంత సంపాదిస్తారనే దానిపై కొద్ది మందికి మాత్రమే అవగాహన ఉంటుంది. అయితే భారత మహిళా క్రికెటర్లలో ఎక్కువ సంపాదించే టాప్ 5 లిస్ట్ ఓసారి పరిశీలిస్తే...

మిథాలీ @ 1:

మిథాలీ @ 1:

అత్యధిక డబ్బు సంపాదించే భారత మహిళా క్రికెటర్ వన్డే, టెస్ట్ కెప్టెన్ మిథాలీ రాజ్. బీసీసీఐ గ్రేడ్-బి కాంట్రాక్ట్ లిస్టులో మిథాలీ ఉంది. బీసీసీఐ ద్వారా మిథాలీకి ఏటా రూ .30 లక్షలు దక్కుతుంది. అలెన్ సోలే, అమెరికన్ టూరిస్టర్, నెక్స్ట్‌జెన్ ఫిట్‌నెస్ స్టూడియో, రాయల్ ఛాలెంజ్ వంటి పెద్ద సంస్థలకు మిథాలీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. వీటి ద్వారా మిథాలీ టాప్‌లో ఉంది. 37 ఏళ్ల మిథాలీ వన్డే క్రికెట్‌లో దాదాపు 7,000 పరుగులు సాధించింది. 189 ఇన్నింగ్స్‌లలో ఆమె సగటు 50.64గా ఉంది.

హర్మన్‌ప్రీత్ @ 2:

హర్మన్‌ప్రీత్ @ 2:

మిథాలీ రాజ్ తర్వాతి స్థానంలో టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఉంది. హర్మన్‌ప్రీత్ బీసీసీఐ గ్రేడ్-ఏ కాంట్రాక్ట్ లిస్టులో ఉంది. బీసీసీఐ ద్వారా హర్మన్‌ ఏటా రూ .50 లక్షలు సంపాదిస్తుంది. ఆమె బ్యాట్ స్పాన్సర్ సియాట్ స్పాన్సర్‌షిప్‌లో భాగం. కౌర్ 114 టీ20 మ్యాచ్‌లలో రెండు వేలకు పైగా పరుగులు చేసింది. టీ20లలో ఓ సెంచరీ కూడా చేసింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు టీమిండియాను తీసుకెళ్లిన తొలి కెప్టెన్‌గా కూడా నిలిచింది.

మంధాన @ 3:

మంధాన @ 3:

మూడో స్థానంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఉంది. మంధానకు బీసీసీఐ గ్రేడ్-ఏ కాంట్రాక్ట్ ఉంది. దీని ప్రకారం ఆమె ఏడాదికి రూ .50 లక్షలు ఆర్జిస్తుంది. ఆమెకు రెండు టాప్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు కూడా ఉన్నాయి. బ్యాట్ స్పాన్సర్ హీరో మోటోకార్ప్, ఎనర్జీ డ్రింక్ కంపెనీ రెడ్ బుల్‌తో ఆమెకు ఒప్పందాలు ఉన్నాయి. భారత జట్టులో రెగ్యులర్ ఓపెనర్ అయిన మంధాన టీ20 ప్రపంచకప్లో మాత్రం పూర్తిగా విఫలమయింది.

పూనమ్ @ 4:

పూనమ్ @ 4:

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల లెగ్ బ్రేక్ బౌలర్ పూనమ్ యాదవ్ నాలుగో స్థానంలో ఉంది. ఇతర మహిళా క్రికెటర్ల మాదిరిగా యాదవ్‌కు చాలా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు లేవు. కానీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో యాదవ్ 150పైగా వికెట్లు తీసి అద్భుతంగా రాణించడంతో బీసీసీఐ గ్రేడ్-ఏ కాంట్రాక్టును పొందింది. ఏటా 50 లక్షల రూపాయలు సంపాదిస్తుంది .అయితే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆమె సంపాదన పెరుగుతుందని అంచనా. ఎందుకంటే టీ20 ప్రపంచకప్లో ఏకంగా 10 వికెట్లతో రాణించింది.

గోస్వామి @ 5:

గోస్వామి @ 5:

బెంగాల్‌కు చెందిన 37 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి అత్యధిక డబ్బు సంపాదించే భారత మహిళా క్రికెటర్లలో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. గోస్వామి టీమిండియా తరపున 10 టెస్టులు, 182 వన్డేలు, 68 టీ20లు ఆడి 300 వికెట్లు పడగొట్టింది. 2019-20 సీజన్‌కు గోస్వామికి గ్రేడ్-బి కాంట్రాక్టు దక్కింది. దీని ప్రకారం గోస్వామి రూ .30 లక్షలు సంపాదిస్తుంది.

Story first published: Tuesday, March 17, 2020, 15:13 [IST]
Other articles published on Mar 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+