For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నార్త్ సెంచరీ: ఆస్ట్రేలియా 478 పరుగుల భారీ స్కోరు

By Srinivas
Tim Paine and Marcus North
బెంగళూర్: భారత్ పై బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో రెండో రోజు ఆదివారం భారీ స్కోరు చేసింది. నార్త్ సెంచరీ సాయంతో ఆస్ట్రేలియా 478 పరుగులకు ఆలవుట్ అయింది. తొలి రోజు టాప్ ఆర్డర్ కుప్పకూలినప్పటికీ ఆ తర్వాత కోలుకుని నిలకడగా ఆడింది. మార్కుస్ నార్త్, టిమ్ పెయినీ ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. ఐదు వికెట్లు కోల్పోయి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 384 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆదివారం రెండో రోడు దూకుడుగా ఆడింది. మిగతా ఐదు వికెట్లను భారత స్పిన్నర్లు హర్భజన్, ప్రజ్ఞాన్ ఓజా తీసుకున్నారు. వాట్సన్ 55, కటిచ్ 43, పాంటింగ్ 77, నార్త్ 128 పరుగులు చేశారు. పెయినీ 59 పరుగులు చేశాడు.

భారత బౌలర్లలో హర్భజన్ 4, ఓజా 3 వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా ఆలవుట్ అయిన తర్వాత భారత్ ఓపెనర్లు విజయ్ మురళీ, వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఈ వార్త రాసేటప్పటికి మురళీ విజయ్ మూడు పరగులతో, సెహ్వాగ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+