హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు, ఎమ్మెస్కే ప్రసాద్ తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నుంచి భారత టెస్టు జట్టులోకి అనూహ్యంగా ఎంపికై అందరిని ఆశ్చర్యపరిచాడు హనుమ విహారి. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో చివరి రెండు టెస్టుల కోసం ఇటీవల భారత సెలక్టర్లు 18 మందితో కూడిన జట్టుని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ఈ జట్టులో హనుమ విహారికి చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఆగస్టు ఆరంభంలో దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లో హనుమ విహారి చేసిన 148 పరుగులే సెలక్టర్లను తనవైపుకి తిప్పుకునేలా చేసింది. దీంతో భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. తాను ఈ స్థాయికి చేరడానికి దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ సాయం చేశారని విహారి తెలిపాడు.
"వీవీఎస్ లక్ష్మణ్ నాకు స్ఫూర్తి. అతనో దిగ్గజ క్రికెటర్. అతనితో కలిసి కొన్ని మ్యాచ్లు ఆడే అవకాశం దక్కింది.. అవి నా కెరీర్కి ఎంతో ఉపయోగపడ్డాయి. నా ఆట మెరుగయ్యేందుకు అతను చాలా సూచనలు చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడేటప్పుడు అతను జట్టుకి మెంటార్గా ఉండటంతో.. టీ20ల్లో ఆట గురించి చర్చించేవాళ్లం" అని అన్నాడు.
"ఐపీఎల్లో సన్రైజర్స్కు ఆడేటప్పుడు లక్ష్మణ్ నాకు చాలా స్వేచ్ఛనిచ్చేవారు. అలానే భారత-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలు కూడా నా ఆట మెరుగయ్యేందుకు దోహదపడ్డాయి" అని హనుమ విహారి వెల్లడించాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడుతోంది.
ఇప్పటివరకు ముగిసిన మూడు టెస్టుల్లో టీమిండియా 1-2తో వెనుకంజలో ఉంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ఆగస్టు 30న సౌతాంప్టన్ వేదికగా ప్రారంభం కానుంది.