
మా వ్యూహం అదే:
'ఆస్ట్రేలియా జట్టులో ఎవరూ విరాట్ కోహ్లీతో చాలా మంచిగా ఉండడం గానీ, అతణ్ని ఔట్ చేయడానికి ప్రయత్నించకుండా ఉండడం గానీ నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరు కోహ్లీ పట్ల సరళంగా ఉన్నారో నాకు తెలియదు. కోహ్లీతో గొడవకు దిగి అతడిని రెచ్చగొట్టకూడదన్నది మా వ్యూహం. ఒకవేళ రెచ్చిగొట్టినప్పుడు అతడు తన అత్యుత్తమ క్రికెట్ ఆడతాడన్నది మా ఉద్దేశం. ఇంతకంటే వేరే ఆలోచన మాకు లేదు' అని టెస్టు కెప్టెన్ టీమ్ పైన్ వివరణ ఇచ్చాడు.

నేను కోల్పోయేదేమీ లేదు:
'ఐపీఎల్ టోర్నీతో నాకైతే పెద్దగా ప్రయోజనాలేమీ లేవు. నేను కోల్పోయేదేమీ లేదు. కానీ.. ఎప్పుడు ఆస్ట్రేలియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడినా మా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తారు. విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేసేటప్పుడు మా బౌలర్లు ఐపీఎల్ కాంట్రాక్టుల గురించి ఆలోచిస్తారని నేను అనుకోను. అతని వికెట్ త్వరగా తీయడానికి ప్రయత్నిస్తారు. అందరికి వేసినట్టే బౌలింగ్ చేస్తారు' అని పైన్ అన్నాడు.

స్లెడ్జింగ్ చేయడానికి భయపడుతున్నారు:
తాజాగా బిగ్ స్పోర్ట్స్ బ్రేక్ఫాస్ట్తో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ... 'అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు ఐపీఎల్ టోర్నీలోనూ భారత్ బలమేంటో అందరికీ తెలుసు. ఆసీస్ ఆటగాళ్లే కాదు దాదాపు అన్ని జట్ల ప్లేయర్లు టీమిండియాకు వ్యతిరేకంగా ఉండరు. భారత క్రికెటర్లపై స్లెడ్జింగ్కి దిగితే.. తమ ఐపీఎల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆస్ట్రేలియా క్రికెటర్లు భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు' అని క్లార్క్ అన్నాడు.

అక్టోబరులో ఆస్ట్రేలియా టూర్:
2018-19 ఆస్ట్రేలియా టూర్లో భారత్ 2-1తో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. భారత జట్టు వచ్చే అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సివుంది. ఆ పర్యటనలో భారత్ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడుతుంది. ప్రస్తుతం మహమ్మారి కరోనా కారణంగా టోర్నీలు అన్ని రద్దయ్యాయి. అయితే ఈ టూర్కు ఇంకా దాదాపు 6 నెలల సమయం ఉండడంతో టోర్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












