
పృథ్వీ షా
ఇటీవలి కాలంలో టీమిండియాకు ఓపెనర్ కావాలి అనగానే గుర్తొస్తున్న పేరు పృథ్వీ షా. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చినట్లు జట్టుకు విధ్వంసకర ఓపెనింగ్ ఇవ్వగలిగే సత్తా షా సొంతం. ఐపీఎల్లో తొలి పవర్ప్లేలో అతని స్ట్రైక్ రేట్ 147.45.. మరే ఇతర భారతీయ ఓపెనర్ కూడా కనీసం అతని దరిదాపుల్లో కూడా లేరు. అందుకే చాలా మంది అభిమానులు కూడా కేఎల్ రాహుల్, రోహిత్ వంటి వారి స్థానంలో షాకు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు.

ఇషాన్ కిషన్
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు మంచి ఆరంభాలు అందించిన ఇషాన్ కిషన్.. భారత జట్టుకు కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే ఇంగ్లండ్లో అతను విఫలం అవడంతో రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్లను ఓపెనర్లుగా ప్రయత్నించారు. స్పిన్ను సమర్ధవంతంగా ఆడతాడని పేరున్న కిషన్ను మిడిలార్డర్లో పంపాలని కొందరు అంటున్నారు. అయితే స్పిన్తోపాటు పేస్ను కూడా ఎదుర్కోగలనని అతను ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నాడు.

యశస్వి జైస్వాల్
ఐపీఎల్లో ఏ సీజన్లోనూ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకోలేదనే మాటే కానీ.. జైస్వాల్ సాధారణ ఓపెనర్ కాదు. జట్టుకు పవర్ప్లేలో అదిరిపోయే ఆరంభాలు అందిస్తూనే.. చివర్లో మంచి ఫినిషింగ్ కూడా ఇవ్వగల సమర్ధుడు. పవర్ప్లేలో అతని స్ట్రైక్ రేట్ 134.55. ఇది మిగతా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (110.82), రిషభ్ పంత్ (124.90), శుభ్మన్ గిల్ (120.98) కన్నా ఎక్కువ కావడం గమనార్హం. కానీ వీళ్లందరూ ఏదో ఒక సీజన్లో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. జైస్వాల్కు ఆ అవకాశం రాలేదంతే.


Click it and Unblock the Notifications












