
రిషభ్ పంత్
పొట్టి ఫార్మాట్లో పెద్దగా రాణించలేదంటూ పంత్పై విమర్శలు ఉన్నాయి. యాభైపైగా టీ20 మ్యాచులు ఆడినా కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు పెద్దగా లేవు. దీంతో అతనికి ఓపెనర్గా ప్రమోషన్ ఇచ్చారు. అండర్-19 జట్టులో ఓపెనర్గా రాణించిన అతను రాహుల్తో పోల్చుకుంటే భారత జట్టుకు కూడా మెరుగైన ఆరంభాలే అందించాడు. ఈ స్థానంలో కుదురుకుంటే పంత్ కచ్చితంగా జట్టుకు మంచి ఓపెనర్ దొరికినట్లే.

పృథ్వీ షా
సెహ్వాగ్ తర్వాత అంత విధ్వంసకరమైన ఓపెనింగ్ అందించగల బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది పృథ్వీ షానే అని చెప్పాలి. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విధ్వంసం సృష్టించిన షా.. 181.42 స్ట్రైక్ రేట్తో 332 పరుగులు చేశాడు. దీంతో అతన్ని కచ్చితంగా ప్రపంచకప్ జట్టులోకి తీసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే రాహుల్పై నమ్మకం ఉంచిన సెలక్టర్లు షాకు హ్యాండిచ్చారు. అదెంత పెద్ద తప్పో ఇప్పుడు తెలిసొచ్చింది.

సంజూ శాంసన్
ఒక ఓపెనర్.. మంచి వికెట్ కీపర్.. అద్భుతమైన ఫినీషర్ వీల్లందరినీ కలిపితే సంజూ శాంసన్. నిలకడ లేదని తనపై ఉన్న విమర్శలకు ఈ ఏడాది శాంసన్ సరైన సమాధానం ఇచ్చాడు. తనకు దక్కిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని దాదాపు అన్ని మ్యాచుల్లోనూ రాణించాడు. జట్టులో ఏ స్థానంలోనైనా ఆడగలిగే శాంసన్ టీ20ల్లో కొత్త టెంప్లేట్కు పూర్తిగా న్యాయం చేయగలడు. రాహుల్లా నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించకుండా ఎంతటి బౌలింగ్ యూనిట్కైనా బౌండరీలతో ముచ్చెమటలు పట్టించే సత్తా ఉన్న ఆటగాడు శాంసన్. ఈ ముగ్గురిలో ఎవరైనా సరే వచ్చే టీ20 ప్రపంచ కప్ నాటికి పొట్టి ఫార్మాట్లో రాహుల్ను రీప్లేస్ చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించగల సమర్థులే.


Click it and Unblock the Notifications












