|
రోహిత్ శర్మకు వెరైటీ శిక్ష విధించిన ముంబై యాజమాన్యం
తాజాగా ఆ వెరైటీ శిక్షను ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు విధించారు. ఎమోజీ డ్రెస్ వేసుకున్న రోహిత్ శర్మ ఫొటోలను ఆయన భార్య రితికాతో పాటు ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. జిమ్ సెషన్కు రాకపోయినా, కిట్ బ్యాగ్ మరిచిపోయినా, డ్రెస్ కోడ్ నిబంధన ఉల్లంఘించినా ఫ్రాంఛైజీ యాజమాన్యం ఆదేశాల మేరకు ఈ ఎమోజీ డ్రెస్ వేసుకోవాల్సిందే.
|
నిబంధనను ఉల్లంఘించిన రోహిత్ శర్మ
పైన పేర్కొన్న వాటిల్లో రోహిత్ శర్మ ఏ నిబంధనను ఉల్లంఘించాడో తెలియరాలేదు. టోర్నీలో భాగంగా తన తదుపరి మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు గురువారం ఢిల్లీకి బయల్దేరింది. ఈ సమయంలో రోహిత్ శర్మ ఎమోజీ బొమ్మలతో కూడిన డ్రెస్ను ధరించడంతో జట్టులోని మిగతా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు అతడిని ఆట పట్టించారు.
|
టోర్నీలో తన చివరి లీగ్ మ్యాచ్ ఢిల్లీ డేర్డెవిల్స్తో
కాగా, టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ తన చివరి లీగ్ మ్యాచ్ను ఆదివారం ఢిల్లీ డేర్డెవిల్స్తో తలపడనుంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన 13 మ్యాచ్ల్లో ఆరింట విజయం సాధించి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ముంబై... ఢిల్లీపై భారీ విజయంతో విజయం సాధిస్తే ప్లే ఆఫ్కు చేరుకుంటుంది.