హైదరాబాద్: క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక సెహ్వాగ్ మైదానంలో కనిపించడం మానేసి.. ట్విట్టర్లోనే కనిపిస్తున్నాడు. కొద్ది రోజుల ముందే ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్గా వ్యవహరించిన సెహ్వాగ్ కొద్ది రోజుల ముందు వరకూ స్టేడియంలో మెరిశాడు. మళ్లీ ట్వీట్లతో అభిమానులతో భావాలను పంచుకునేందుకు సిద్ధమైయ్యాడు. ఈ క్రమంలో ట్విటర్లో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సందడి మొదలైంది.
తాజాగా సెహ్వాగ్ ఒక ట్వీట్ చేశాడు. అంతేకాదు దానికి ఒక వీడియో కూడా జత చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... భార్యాభర్తలిద్దరూ సరదాగా గడుపుతన్న సన్నివేశం. తన భార్య కాళ్లు నీటి టబ్లో ఉంచి వాటిని కడుగుతూ ఉంటాడు. అలా కబుర్లు చెప్పుకుంటున్న వారు హఠాత్తుగా వచ్చిన అతని తల్లిని గమనిస్తారు. వెంటనే.. భార్య కాళ్లను అందులోంచి తీసివేస్తుంది. దీంతో ఆ టబ్లో ఉన్న నీళ్లను నెత్తి మీద జల్లుకుని తల శుభ్రం చేసుకుంటున్నట్లుగా కొడుకు చేస్తుంటే అతనిని తల రుద్దుతున్నట్లు ఆమె నటిస్తుంది.'
When your mother-in law suddenly appears pic.twitter.com/tLCdF29Nhf
— Virender Sehwag (@virendersehwag) June 1, 2018
కాస్త నవ్వుత తెప్పించేదే అయినా అత్తా కోడళ్ల మధ్య ఇప్పటికీ ఉన్న సంబంధాన్ని ఈ వీడియోలో బహిర్గతం చేశారు. ఈ విదేశీయుల వీడియో సెహ్వాగ్ వరకూ చేరడంతో దానిని సెహ్వాగ్ కూడా షేర్ చేశాడు. ఏదేమైనా కొడుకు కోడలు కడుగుతుండగా ఏ తల్లి ఒప్పుకోదని దానర్థం. కానీ, భర్తతో సేవలు చేయించుకోవాలని భార్యకి ఉంటుంది కదా.
ఈ ఏడాది ఐపీఎల్లో సెహ్వాగ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు మెంటార్గా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. లీగ్ మధ్యలో సెహ్వాగ్కు ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింతాతో మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఐతే, వాటిని ప్రీతి ఖండించిన సంగతి తెలిసిందే.