బెంగళూరు: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యువరాజ్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 9 టైటిల్ దక్కించకోవడంలో యువరాజ్ తనవంతు పాత్రను పోషించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచులో యువరాజ్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 38 పరుగులు చేశాడు. ఫీల్డింగులోను మెరుపులు మెరిపించాడు. ఇలాంటి యువరాజ్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

వన్డే ప్రపంచ కప్, ట్వంటీ 20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, అండర్ 19 ప్రపంచ కప్, ఐపీఎల్ టైటిల్స్ దక్కించుకున్న జట్లలో సభ్యుడిగా ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2011లో వన్డే ప్రపంచ కప్లో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచన విషయం తెలిసిందే.
యువరాజ్ ఎమోషనల్
ఐపీఎల్ 9 కప్ గెలిచిన అనంతరం యువరాజ్ సింగ్ ఎమోషనల్ అయ్యాడు. ఆశిష్ నెహ్రా గాయాలతో మ్యాచుకు దూరమయ్యాడు. కప్ గెలిచిన సంబరంలో కూడా యువరాజ్ నెహ్రూను మర్చిపోలేదు. నెహ్రాజీ నిన్ను మిస్ అయ్యాం.. అంటూ యువరాజ్ సింగ్ ఇన్స్టాగ్రాంలో పెట్టాడు