రిషబ్ పంత్ అతి తక్కువ వయసులో ఇండియాన్ క్రికెట్ లో తన దైనా ముద్ర ను వేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే తన బ్యాటింగ్ స్కిల్ తో మాజీ క్రికెటర్స్ పొగడ్తలను కూడా పొందాడు. పంత్ కు మంచి భవిష్యత్ ఉందని కొని యాడారు. వృద్ధిమాన్ సాహా గాయాల పాలవడంతో అనూహ్యంగా రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో చోటు సంపాదించాడు.
అయితే తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించు కున్నాడు. లండన్, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ల్లో సెంచరీస్ తో చెలరేగిపోయాడు. దీనితో పంత్ యొక్క టాలెంట్ దేశానికీ తెలిసిందే. కేవలం సెంచరీస్ చేయడమే కాకుండా తన బ్యాటింగ్ స్టయిల్ తో మాజీ క్రికెటర్ లను కూడా మంత్ర ముగ్దులను చేశాడు .
అయితే పంత్ మాట్లాడుతూ ... తన కు టెస్ట్ ల్లో అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదని వృద్ధిమాన్ సహా భాయ్ కు గాయం అవటం తో అనుకోకుండా నాకు బీసీసీఐ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దానితో ఒక్క సారిగా అనందం పట్టలేకపోయాను. ఇదే విషయాన్ని మా మ్మ గారితో చెబితే చాలా సంతోషం పడ్డారని , అలాగే తనకు పరిస్థితుల తగ్గట్టు ఆడటం మాత్రం నేర్చుకున్నాని చెప్పుకొచ్చాడు.