For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వర్షం కారణంగా భారత్ ఆస్ట్రేలియా మూడో వన్డే ఆలస్యం

By Srinivas
India vs Australia
మార్గోవా: భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరనగన్న మూడో వన్డే మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కోచ్చి, విశాల మాదిరిగానే అక్కడా వరుణుడు భయపెడుతున్నాడు. వర్షం కారణంగా కోచి వన్డే రద్దయినప్పటికీ విశాఖలో అంతకుముందు రోజు తగ్గటంతో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే మార్గోవాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా నెహ్రూ స్టేడియంలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యం కానుంది. మైదానం తడిదా ఉన్నందున మ్యాచ్ ఆలస్యం కావటంతో పాటు, ఓవర్లను తగ్గించే అవకాశముంది. పిచ్ పరిస్థితిని 11 గంటలకు మ్యాచ్ రెఫరీలు పరీక్షించి మ్యాచ్‌పై ఓ నిర్ణయం తీసుకుంటారు.

ఈ మ్యాచ్ ఆడటం ఆసీస్ కు చాలా ముఖ్యం. ఇప్పటికే భారత్ ఒక మ్యాచ్ నెగ్గటంతో భారత్ ముందుంది. మార్గోవా మ్యాచ్ లో నెగ్గి సిరీస్ సమం చేయాలని ఆసీస్ చూస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్ 10 ఆధిక్యాన్ని సంపాదించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో ఒక మార్పు జరిగే అవకాశముంది. వినయ్ కుమార్ స్థానంలో మునాఫ్ ఆడే అవకాశముంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+