
వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ రద్దయింది. గబ్బా భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేశారు. ఇరు జట్లు ఇప్పటికే ఒక్కో వార్మప్ మ్యాచ్ ఆడాయి. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 57 పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 50 పరులుగు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
సూపర్-12
ఇటు న్యూజిలాండ్ సౌతాఫ్రికాతో తలపడగా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 98 పరుగులకే ఆలౌట్ అయింది. సూపర్ -12లో భాగంగా 22న న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 23న ఇండియా పాకిస్థాన్ తో పోటీ పడనుంది. వర్షం కారణంగా ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అనంతరం పాక్ బ్యాటింగ్ రాగా.. వర్షం పడి మ్యాచ్ రద్దయింది.