
264 vs శ్రీలంక, 2014
రోహిత్ వన్డే కెరీర్లోనే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 264పరుగులు. కేవలం 173 బంతుల్లో 264 పరుగులు (33ఫోర్లు, 9సిక్సులు)పూర్తి చేశాడు. రోహిత్ బాదుడుకి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 404పరుగులు చేసింది. ఆ తర్వాత చేధనకు దిగిన శ్రీలంక 153పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయింది.

209 vs ఆస్ట్రేలియా, 2013
రోహిత్ కెరీర్లో గుర్తుండిపోయే విషయాల్లో ఇదొకటి. క్రికెట్ కెరీర్లో మూడో డబుల్ సెంచరీల్లో ఈ ఇన్నింగ్స్ నిలిచిపోతుంది. భారత క్రికెటర్లు అయిన సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్లతో పాటుగా రోహిత్ శర్మ కూడా చేరిపోయాడు. 209పరుగులు చేసిన శర్మ(158 బంతుల్లో, 12 ఫోర్లు, 16 సిక్సులు)చేసి భారత్ను గెలిపించాడు.

137 vs ఇంగ్లాండ్, 2018
ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో మొదటి వన్డేలో రోహిత్ అదరగొట్టేశాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను కుల్దీప్ యాదవ్ కేవలం 25 పరుగులిచ్చి 6వికెట్లు పడగొట్టాడు. ఆ దెబ్బతో టీమిండియా 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. మెరుపు షాట్లు బాదిన రోహిత్ 137పరుగులు(114బంతుల్లో, 15ఫోర్లు, 4 సిక్సులతో)చేశాడు. రోహిత్ స్కోరు తోడవడంతో భారత్ 40.1ఓవర్లలోనే టార్గెట్ ను చేధించింది. దీంతో భారత్ 1-0తేడాతో శుభారంభాన్ని నమోదు చేసింది.

137 vs బంగ్లాదేశ్, 2015
మెల్బౌర్న్ వేదికగా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్లో ప్రత్యర్థి బంగ్లాదేశ్పై విరుచుకుపడ్డాడు రోహిత్. ఏకంగా రోహిత్ శర్మ 137పరుగులు చేసి జట్టుకు ఆధిక్యాన్నందించాడు. దీంతో భారత్302/6పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ 109పరుగుల తేడాతో ఓడించేసింది.

86 vs వెస్టిండీస్, 2011
ఆ మ్యాచ్లో ఆండ్రీ రస్సెల్ నుంచి ప్రత్యేకమైన ఇన్నింగ్స్ వస్తేనే కానీ, మ్యాచ్ గెలవదు. ఆ సందర్భంలో మెరుపు షాట్లు కొట్టాడు రస్సెల్(92: 64బంతుల్లో 8ఫోర్లు, 5సిక్సులు) చేశాడు. ఇలా వెస్టిందడీస్ 225పరుగులకు ఎనిమిది వికెట్లు నష్టపోయి ఇన్నింగ్స్ ముగించింది. ఆ తర్వాత చేధనకు దిగిన భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆరు వికెట్ల నష్టానికి 92పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత రోహిత్ శర్మ (86: 91 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సులు) చేశాడు. ఆ మ్యాచ్కు ప్రవీణ్ కుమార్ కెప్టెన్సీ వహించాడు. ఈ మ్యాచ్తో భారత్ 3-0తేడాతో సిరీస్ గెలిచింది.


Click it and Unblock the Notifications
