రంజీ ట్రోఫీ డిసెంబర్ 13నుంచి ప్రారంభం
ఇండియాలోని అత్యంత ఆదరణ ఉన్న దేశీయ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ. ఈ ట్రోఫీలో రెండు విభాగాలుంటాయి. 1) ఎలైట్, 2) ప్లేట్. ఎలైట్ గ్రూప్, ప్లేట్ గ్రూప్ లీగ్ మ్యాచ్లు డిసెంబర్ 13న ప్రారంభమవుతాయి. ప్లేట్ లీగ్ జనవరి 29న ముగుస్తుంది. ఎలైట్ గ్రూప్ ఫిబ్రవరి 20న ముగుస్తుంది. తర్వాత క్వార్టర్స్, సెమీఫైనల్లు, ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి.
మళ్లీ సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ వన్డే, టీ20 ట్రోఫీలు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరగాల్సి ఉన్నందున.. మహిళల క్యాలెండర్ సీనియర్ మహిళల టీ20 ట్రోఫీతో అక్టోబర్ 11న ప్రారంభమవుతుంది. నవంబర్ 5న ఈ ట్రోఫీ ముగుస్తుంది. ఆ తర్వాత సీనియర్ మహిళల ఇంటర్జోనల్ టీ20, టీ20 ఛాలెంజర్లు జరుగుతాయి. తర్వాత సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ, తర్వాత ఇంటర్ జోనల్ వన్డేలు జరుగుతాయి. ఈ సీజన్లో సీనియర్ మహిళల ఇంటర్జోనల్ టీ20, వన్డే ట్రోఫీలు తిరిగి ప్రవేశపెట్టబడడం గమనార్హం.


తొలిసారి అండర్ 16 వన్డే టోర్నీ
తొలిసారిగా బీసీసీఐ అండర్ -16 స్థాయిలో బాలికల కోసం వన్డే టోర్నమెంట్ను నిర్వహించనుంది. ఈ పోటీ అమ్మాయిలకు చిన్న వయస్సులోనే పోటీ క్రికెట్ అనుభూతిని పొందడంలో సహాయపడుతుంది. అండర్-19 స్థాయికి వాళ్లను మరింత రాటుదేల్చుతుంది. మహిళల అండర్ 19 టీ20 ట్రోఫీ, మహిళల అండర్ 19 టీ20 ఛాలెంజర్ అక్టోబర్ 1నుండి నవంబర్ 7వరకు షెడ్యూల్ చేయబడ్డాయి.


Click it and Unblock the Notifications












